ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బెజ్జాల రవికుమార్(24) అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహకవిపోతన కాలనీలో చోటుచేసుకుంది. రవికుమార్ ఎంటెక్ చదివాడు. చదువు అయిపోయి సంవత్సరం గడిచినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.