చోరీలతో బెంబేలు

12 Dec, 2016 14:30 IST|Sakshi

చిలమత్తూరు : కోడూరు పంచాయతీ అంజితండా సమీపంలో గల లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కార్యాలయంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. కార్యాలయంలోని సోఫాలు, టేబుల్స్‌ తదితర ఫర్నిచర్, విలువైన సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట ఎత్తుకెళ్లుతున్నట్లు తెలిపారు. గ్రామంలోకి కూడా చొరబడతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిఘా ఉంచాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు