హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

8 Sep, 2016 23:43 IST|Sakshi

ధర్మవరం అర్బన్‌ :  రామగిరి మండలం నసనకోటలో ఆగస్టు 26న మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వేణుగోపాల్‌ తెలిపారు.  గురువారం  పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఆగస్టు 26న స్వర్ణను ఆమె భర్త, మామ, అత్తలు హత్య చేసి, అనంతరం ఉరేసుకున్నట్లు చిత్రీకరించారన్నారు. విచారణలో హత్యగా నిర్ధారణ అయ్యిందన్నారు. హతురాలి భర్త శ్రీహరి, అత్త, మామలు క్రిష్ణమ్మ, చండ్రాయుడులను ఎన్‌ఎస్‌గేటు వద్ద గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు