ఒకే రోజు మూడు ప్రసవాలు

8 Jan, 2017 22:44 IST|Sakshi
ఒకే రోజు మూడు ప్రసవాలు

రూరల్‌ జిల్లాలో రికార్డు సృష్టించిన సంగెం పీహెచ్‌సీ
జన్మించిన వారిలో  ముగ్గురూ మగ శిశువులే!


సంగెం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో శనివారం ఒకే రోజు ముగ్గురు గర్భిణులకు వైద్యులు ప్రసవాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఒకేరోజు మూడు ప్రసవాలు జరగడం జిల్లాలో రికార్డు కాగా, వైద్యాధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు. గర్భిణులైన గాంధీనగర్‌ గ్రామానికి చెందిన చిర్రబోయిన రాధిక, గవిచర్ల గ్రామానికి చెందిన కెనసాలపు మమత శుక్రవారం సాయంత్రం పీహెచ్‌సీలో చేరారు.

వీరిలో మమత రాత్రి 12.05కు, రాత్రి 2.15 గంటలకు రాధిక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తెల్లవారుజామున తీగరాజుపల్లికి చెందిన అజ్మీరా కవిత మొదటి కాన్పు కోసం రాగా ఉదయం 8.05కు మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్‌ శంకేసి శిరీష్‌కుమార్, స్టాఫ్‌ నర్సులు సునిత, అనిల్‌ చికిత్స చేయగా.. వైద్యాధికారి డాక్టర్‌ సుధీర్‌బాబు అభినందించారు. ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు సంగెం పీహెచ్‌సీలో 37 ప్రసవాలు జరిగాయని వైద్యాధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు