అడవి పంది దాడి: ముగ్గురికి గాయాలు

17 Sep, 2016 13:31 IST|Sakshi

వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం అడవిపంది హల్‌చల్ చేసింది. స్థానిక పాత వీరభద్ర సినిమాహాల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు పాదచారులపై అడవిపంది దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అడవిపందిని చంపేశారు.

మరిన్ని వార్తలు