రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

17 Sep, 2016 01:48 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : రుద్రంపేటలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ దినపత్రికలో పనిచేస్తున్న రాజారెడ్డి ఇంటి నుండి విధులకు వెళ్తుండగా ఎదురుగా మరొక ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి  తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు