డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురికి గాయాలు

2 Aug, 2016 08:15 IST|Sakshi

దువ్వూరు : కడప జిల్లా దువ్వూరు చెరువు సమీపంలో మంగళవారం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన జ్యోత్స్న, బ్రహ్మయ్య, చాంద్బాషా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. డివైడర్లోకి దూసుకుపోయిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు