బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలు

9 Sep, 2016 19:50 IST|Sakshi

అక్కయ్యపాలెంలోని చేకుదురాయి బిల్డింగ్ వద్ద ఓ దుకాణంలో బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో ఉన్న గ్యాస్ కంప్రెషర్ పేలి బాణసంచాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట బాంబు పేలిందేమోనని స్థానికులు అనుమానపడ్డారు. బాంబు స్క్వాడ్ తనిఖీతో అటువంటిదేమీ లేదని, కేవలం బాణసంచా పేలుడేనని తేల్చారు.

 

మరిన్ని వార్తలు