ముగ్గురికి పోలీసు మెడల్స్‌

15 Aug, 2017 23:25 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌: జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు ప్రతిష్టాత్మక ఇండియన్‌ పోలీసు మెడల్స్‌(ఐపీఎం) లభించాయి. విధి నిర్వహణలో చిన్న రిమార్కు కూడా లేకుండా పనిచేసిన అదనపు ఎస్పీ మాల్యాద్రి, పీటీసీ ప్రిన్సిపాల్‌ వెంకట్రామిరెడ్డి, పీటీసీలోనే ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న ధనుంజయరెడ్డిలు మంగళవారం తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

>
మరిన్ని వార్తలు