తీరానికి చేరిన 'టైగర్'

9 Aug, 2015 20:22 IST|Sakshi
తీరానికి చేరిన 'టైగర్'

కొత్తపల్లి: తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ టైగర్ 'ఫిష్' తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. ఆదివారం ఆటవిడుపుగా వచ్చిన సందర్శకులు చనిపోయిన ఈ చేపను చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇలా చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు