టిప్పర్‌ క్లీనర్‌ దుర్మరణం

8 Feb, 2017 00:41 IST|Sakshi
బనగానపల్లె రూరల్‌: యాగంటిపల్లె గ్రామ సమీపంలో జీఎన్‌ఎస్‌ కాల్వ వద్ద ప్రమాదవశాత్తు టిప్పర్‌ ఢీకొని క్లీనర్‌ దుర్మరణం చెందాడు. మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన పాపిరెడ్డి కుమారుడు బత్తుల వెంకట శివారెడ్డి (32) టిప్పర్‌ క్లీనర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం జీఎన్‌ఎస్‌ కాల్వ సమీపంలో మట్టిని అన్‌లోడింగ్‌ చేస్తుండగా డ్రైవర్‌ నిర్లక్ష్యంతో టిప్పర్‌ వెనుక టైర్ల కింద పడి వెంకటశివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య శివమ్మ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎస్‌ఐ రాకేష్‌ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  
 
మరిన్ని వార్తలు