గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్‌

15 Sep, 2017 22:32 IST|Sakshi
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్‌

శింగనమల: బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్‌జైలు సమీపంలో తాడిపత్రి రహదారిపై భద్రంపల్లి క్రాస్‌ వద్ద శుక్రవారం గొర్రెల మందపై టిప్పర్‌ దూసుకెళ్లింది. పది గొర్రెలు మృతి చెందగా.. మరో ఎనిమిది గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. టిప్పర్‌ అతి వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవరు టిప్పరు నిలిపి పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి  ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు