ఆంధ్రప్రదేశ్ పోలీస్ డెరైక్టర్ జనరల్ రాముడు సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి స్వామివారి ప్రసాదాలను బహూకరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం సోమవారం ఉదయం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 6 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీనివాసుని 84,049 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.