కులవృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

7 Oct, 2016 22:43 IST|Sakshi
కులవృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ఆలేరు : మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల్లో ౖనైపుణ్యం పెంపొందించుకోవాలని చేనేత రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ రాంగోపాల్‌రావు అన్నారు. ఆలేరులోని చేనేత సహకార సంఘంలో శుక్రవారం చేనేత కార్మికులకు ఆరో విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు నైపుణ్యంతో వస్త్రాలను రకరకాల డిజైన్‌లతో, నాణ్యంగా తయారుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఏడీ రతన్‌కుమార్, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏడీ íß మోద్‌కుమార్, ఏడీఓ వీఎస్‌ఎన్‌ రెడ్డి, డిజైనర్‌ పల్లావిజోషి, సీడీ సౌజన్య, చైర్మన్‌ చింతకింది వెంకటేశ్, కార్యదర్శి ఎనగందుల రామరుషి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు