రూ. 25 వేల విరాళం అందజేత

9 Aug, 2016 21:28 IST|Sakshi
రూ. 25 వేల విరాళం అందజేత
గరిడేపల్లి : కృష్ణా పుష్కరాల కోసం మట్టపల్లి నర్సింహాస్వామి క్షేత్రంలో జరుగే నిత్యాన్నదాన కార్యక్రమానికి మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విరాళం అందజేశారు. ఇందులో భాగంగా రూ. 25 వేలు, ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఆ సంఘం మండల అధ్యక్షుడు కడియం అప్పయ్య, అన్నదాన సత్రం అధ్యక్షుడు సాలేటి రామారావుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మున్నూరు కాపుల వద్ద నుంచి ఈ విరాళం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల రాము, కంబాలపల్లి వెంకటనారాయణ, గోపగాని సత్యనారాయణ, అర్జున్‌రావు, సైదులు, వెంకటమ్మ, సత్యావతి పాల్గొన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు