వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

25 Aug, 2016 22:51 IST|Sakshi
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
హాలియా : పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నోముల నర్సింహ్మయ్య అన్నారు. యోగ బ్రహ్మ శ్రీరుషి ప్రభాకర్‌ గురూజీ జయంతి సందర్భంగా ఎస్‌ఎస్‌వై ధ్యాన మండలి ఆధ్వర్యంలో గురువారం హాలియాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగ చేయడం ద్వారా మనిషి శారీరక రుగ్మతలు దూరమవుతాయన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్, సైదులు, లింగారెడ్డి, రవికుమార్, విజయేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముత్యాలు, లింగారెడ్డి, యాదగిరి, సక్రునాయక్, రాఘవేంద్ర, శంకర్, మాల్యాద్రి, శంకరయ్య, శేఖర్, శివయ్య, సామ్యేల్, బ్రహ్మానందరెడ్డి, రాంబాబు, లక్ష్మయ్య, బాలరాజు, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు