నేడు హైస్కూల్స్ బంద్‌కు ఏబీవీపీ పిలుపు

12 Jul, 2016 04:12 IST|Sakshi

బాలాజీచెరువు (కాకినాడ): జిల్లాలో ఉన్న హైస్కూళ్లూ మంగళవారం బంద్ నిర్వహించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్ సి.సాగర్ సోమవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ కమిటీలు నియమించి, విద్యాహక్కు చట్టం అమలుతో పాటు పాఠశాలల క్లస్టర్ విధానం రద్దు చేయాలనే డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు