నేడు కంగాల్‌షా వలీ ఉరుసు

1 Mar, 2017 23:08 IST|Sakshi
నేడు కంగాల్‌షా వలీ ఉరుసు
– తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు
– ముగిసిన గంధం  
కర్నూలు సీక్యాంప్‌ : తుంగభద్ర నదీ తీరంలో బావాపురంలో  కంగాల్‌షా వలీ ఉరుసు బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలిరోజు వేలాది భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో గంధం కార్యక్రమం నిర్వహించారు. గురువారం కిస్తీ, ఖవ్వాలీ నిర్వహించనున్నట్లు పీఠాధిపతి సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌ ఖాద్రీ తెలిపారు. వాటిని తిలకించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు