నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌

14 Jul, 2017 22:44 IST|Sakshi
నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌

ఎస్కేయూ : ఏపీ ఐసెట్‌–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగియనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం , ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 850 మంది హాజరయ్యారు. గత నాలుగు రోజులు కంటే శుక్రవారం అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు తెలిపారు.

మరిన్ని వార్తలు