-

నేడు న్యాయవాదులు విధుల బహిష్కరణ

3 Feb, 2017 00:34 IST|Sakshi
- ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌
కర్నూలు(లీగల్‌): నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని, న్యాయవాదుల సంక్షేమ నిధి రూ.3లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచాలనే డిమాండ్‌తో శుక్రవారం విధులను బహిష్కరించనున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన బార్‌ అసోసియేషన్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదాను ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు అనిల్‌కుమార్, తిరుపతయ్య, పుల్లారెడ్డి, గీతామాధురి, అబ్దుల్‌ కరీం తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు