పొలమూరు, (పెనుమంట్ర) : పొలమూరులో శుక్రవారం జరగనున్న వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గోనున్నారు. గ్రామంలో నెలకొల్పిన వైఎస్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆమె రాష్ట్ర నాయకులతో కలిసి పాల్గొంటారు. నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్ నాయకత్వంలో గ్రామంలో జరిగే గడప గడపకూ వైఎస్సార్లో కూడా ఆమె పాల్గొంటారు.
భారీ ఏర్పాట్లు
పొలమూరులో జరిగే కార్యక్రమానికి పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిలో సిద్ధాంతం వద్ద, పెనుగొండ, మార్టేరు, బ్రాహ్మణచెరువు కూడలితో పాటు, భీమవరం రూట్లో వీరవాసరం, నవుడూరు తదితర ప్రాంతాల్లోనూ ఫెక్సీలు అమర్చారు. నాయకులు మాట్లాడే వేదికను సిద్ధం చేశారు. వాన కురిసినా ఇబ్బంది పడకుండా వీలైన ప్రత్యేక టెంట్లు అమర్చారు. నాయకులు, కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 4 వేల మంది పాల్గొంటారని పార్టీ మండల కన్వీనర్ కర్రి వేణుబాబు తెలిపారు. కాగా సభా ఏర్పాట్లను నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, గుంటూరి పెద్దిరాజు, పీడీ రాజు, దాట్ల రంగావతి, వాసు రెడ్డి, కలిదిండి దినేష్రాజు, ఉన్నమట్ల మునిబాబు, సుంకర సీతారామ్, వైట్ల కిషోర్, దంపనబోయిన బాబూరావు, బుర్రా రవికుమార్ తదితరులు గురువారం సాయంత్రం పర్యవేక్షించారు.