నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి

13 May, 2017 22:20 IST|Sakshi
కర్నూలు(రాజ్‌విహార్‌): జిల్లాలో ఉన్న పెట్రోలు బంకులు పనిచేస్తాయని కర్నూలు జిల్లా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఇస్తున్న కమీషన్‌ మార్జిన్‌ తమకు పెంచాలనే డిమాండ్‌తో ఆదివారం బంకుల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి బంద్‌ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీన అన్ని బంకులు రోజులాగే పనిచేస్తాయని అసోసియేషన్‌ ప్రకటించింది.
 
మరిన్ని వార్తలు