కరీంనగర్ సిటీ: జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో సూరజ్కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు వ్యవసాయం, మధ్యాహ్నం 2 గంటలకు విద్య, వైద్యం, సాయంత్రం 4 గంటలకు స్త్రీ,శిశుసంక్షేమం, 4వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు సాంఘిక సంక్షేమం, మధ్యాహ్నం 2గంటలకు గ్రామీణాభివృద్ధి, సాయంత్రం 4గంటలకు ఆర్థిక, ప్రణాళిక, పనుల సంఘ సమావేశాలు ఆయా కమిటీల చైర్మన్ల అధ్యక్షతన జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, సంబంధిత అధికారులు హాజరు కావాలన్నారు.