తీరానికి కూర్మ కళేబరం

9 Feb, 2017 00:27 IST|Sakshi
తీరానికి కూర్మ కళేబరం
మొగల్తూరు: నిన్న డాల్ఫిన్, నేడు తాబేలు ఇలా రోజుకో మృత జలచరం తీరానికి కొట్టుకువస్తోంది. కొద్దిరోజుల క్రితం చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఆయిల్‌ తెట్టు సముద్ర నీటిలో తెలియాడుతోంది. దీని ప్రభావం జలచరాలపై పడింది. కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిసిన తెట్టును తొలగించినా సముద్ర జలచరాలకు పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం నరసాపురం మండలం పీఎం లంక తీరానికి మృత డాల్ఫిన్‌ కొట్టుకురాగా, బుధవారం మొగల్తూరు మండలం కేపీ పాలెం తీరానికి మృత తాబేలు కొట్టుకువచ్చింది. 
 
 
మరిన్ని వార్తలు