రెవెన్యూ అధికారులతోనే ‘టాస్’

12 Dec, 2016 15:14 IST|Sakshi

రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ విన్నపం

 సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో మాదిరిగానే రాష్ట్రంలోనూ రెవెన్యూ అధికారులతోనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(టాస్)ని ప్రవేశపెట్టాలని రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల బృందం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(టాస్) ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా శుక్రవారం బెంగళూరులో విధానసౌధ(సెక్రటేరియేట్)ను సందర్శించింది. కర్ణాటకలో 1957 నుండి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉందని, ఇందులో గ్రూప్ ఏలో డిప్యూటీ కలెక్టర్ స్థారుు అధికారులు, గ్రూప్ బీలో తహసీల్దార్ స్థారుు అధికారులతో పూర్తిగా రెవెన్యూశాఖ అధికారులతో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(కాస్) నిర్వహిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు