కోవూరు: నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 9 ట్రాక్టర్లు, 6 ఆటోలను సోమవారం సీజ్ చేసి కోవూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్ఐ అళహరి వెంకట్రావు కోవూరులో తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకపోతే బాధితులకు ఎటువంటి ఆర్థిక భరోసా ఉండదన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకుని వాహన చోదకులు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.