15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

14 Nov, 2015 00:52 IST|Sakshi
15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖపట్నం: ఈ నెల 15న విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించనున్న ఆఫ్ మారథాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు రిషికొండ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఆఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ సమయంలో ఇక్కడ వాహనాల రాకపోకలను అనుమతించబోమని వారు వెల్లడించారు. త్రిపుర జంక్షన్, సీఆర్రెడ్డి జంక్షన్, ఏయూ ఇన్ గేట్ నుంచి హైస్కూలు రోడ్డులో ఖాళీ ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలు కల్పించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు