పెళ్లి వేడుకలో విషాదం

4 Jun, 2017 22:18 IST|Sakshi
పెళ్లి వేడుకలో విషాదం
- విద్యుదాఘాతంతో యువకుడు మృతి
- ఓబుళాపురంలో ఘటన
 
డోన్‌ టౌన్‌ : పెళ్లి వేడుకలో విద్యుత్‌ అలంకరణ కోసం ఏర్పాటు చేసిన తీగలు ఓ యువకుడి ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటన ఆదివారం మండల పరిధిలోని ఓబుళాపురంలో చోటు చేసుకుంది. కొత్తపల్లె గ్రామానికి చెందిన కోదండరామయ్య (24) వాయిద్య బృందంతో పాటు ఓబులాపురంలో మేళంవాయిస్తుండగా విద్యుత్‌ అలంకరణ కోసం ఏర్పాటుచేసిన తీగ తెగి మీదపడింది. దీంతో విద్యుత్‌ షాక్‌ కొట్టి అతడు అక్కడికక్కడే మరణించాడు.  మృతుని బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో మృతుని భార్య భాగ్యలక్ష్మి రోదన అక్కడున్న వారిని సైతం కంట తడి పెట్టించింది. 
 
మరిన్ని వార్తలు