కాకినాడ సిటీ:
జిల్లాలో కీలకమైన రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి 10 గంటల వరకు కూడా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీల గడువు ముగిసింది. దీంతో గురువారం నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి రానుంది. ప్రధానమైన రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహసీల్దార్ కేడర్ వరకు నిబంధనల మేరకు బదిలీలకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.