రెవెన్యూశాఖలో బదిలీల కౌన్సెలింగ్‌

21 May, 2017 01:14 IST|Sakshi
అనంతపురం అర్బన్‌: రెవెన్యూ శాఖలో  బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి తన చాంబర్‌లో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి డిప్యూటీ తహశీల్దారులు (డీటీ), సీనియర్‌ అసిస్టెంట్లు(ఎస్‌ఏ), జూని యర్‌ అసిస్టెంట్లు (జేఏ), వీఆర్‌ఓలకు  కౌన్సెలింగ్‌ చేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు డీటీలు, 10 మంది ఎస్‌ఏ, నలుగురు జూనియర్‌ అసిసెంట్లు, ఒక టైపిస్టు, 55 మంది వీఆర్‌ఓలు హాజరయ్యారు.
>
మరిన్ని వార్తలు