మొరాయించిన డబుల్‌డెక్కర్‌

6 Nov, 2016 22:10 IST|Sakshi
మొరాయించిన డబుల్‌డెక్కర్‌
డోన్‌ టౌన్‌ : తిరుపతి నుంచి కాచిగూడ వైపు వెళ్తున​‍్న డబుల్‌ డెక్కర్‌ రైలు (22120) మధ్యాహ్నం 12గంటలకు డోన్‌ రైల్వేస్టేషన్‌ శివారులోని దొర్రపల్లె బ్రిడ్జి వద్ద  నిలిచిపోయింది. కంగారు పడిన రైల్వే అధికారులు రైలును పరిశీలించగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు.   హుటాహుటిన వేరే ఇంజిన్‌ సహాయంతో రైలును స్టేషన్‌కు తీసుకెళ్లి మరమ్మతులు చేపట్టారు. మధ్యాహ్నం 01.00 గంటకు డోన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సుమారు 2గంటలు ఆలస్యంగా వెళ్లింది.
 
మరిన్ని వార్తలు