– ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
డోన్ టౌన్ : సాంకేతికలోపంతో బుధవారం మధ్యాహ్నం గూడ్స్ ఇంజిన్ మోరాయించింది. పట్టణంలోని రైల్వేగేట్ మధ్యలో గూడ్స్ కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో గేటుకు ఇరువైపులా ట్రాపిక్ స్తంభించిపోయింది. వాహనదారులు, పాదచారులు గంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఇంజిన్ను ఏర్పాటు చేసి గూడ్స్ కంటైనర్లను స్టేషన్లోకి తరలించడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది.