టీఆర్ఎస్ సమావేశంలో రగడ

1 Nov, 2015 17:40 IST|Sakshi
టీఆర్ఎస్ సమావేశంలో రగడ

వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ సమావేశంలో రగడ జరిగింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కడియం శ్రీహరి వల్లే రాజయ్య మంత్రి పదవి పోయిందని ఆయన వర్గీయులు ఆరోపించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు