‘మహా’ ఒప్పందంపై హర్షం

24 Aug, 2016 22:36 IST|Sakshi
‘మహా’ ఒప్పందంపై హర్షం

చిలుకూరు: అంతరాష్ట్ర నీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్రతో ఒప్పందాలను కుదుర్చుకోవడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి బుధవారం స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఇది చారిత్రాత్మక ఒప్పందం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరక్టర్‌ కస్తూరి నర్సయ్య, మాజీ ఎంపీపీ దొడ్డా సురేష్‌బాబు,  మండల పార్టీ అధ్యక్షుడు వట్టకూటి నాగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు రాయళ్ల లక్ష్మీనారాయణ, మేకపోతుల శ్రీను, కడియాల వెంకటేశ్వర్లు, నెల్లూరి నాగేశ్వరరావు,  మాదారపు శ్రీను, కస్తూరి వెంకటి, ఎంఎమ్‌ సాయి. కైలాసపు ఏడుకొండలు, భిక్షం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు