టర్మరిక్ స్పైస్ పార్క్ పై అధికారుల సమీక్ష

24 Jun, 2016 19:07 IST|Sakshi

హైదరాబాద్: టర్మరిక్ స్పైస్ పార్క్ ఏర్పాటుపై మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్ఐఐసీ, హార్టికల్చర్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

స్థానిక పసుపు రైతులకు లాభం చేకూరేలా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేరళ, తమిళనాడులో స్పైస్ పార్క్లను సందర్శించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు