గరుడ బస్సులో మంటలు

15 Aug, 2017 18:31 IST|Sakshi
గరుడ బస్సులో మంటలు

జక్రాన్ పల్లి: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రం వద్ద గరుడ ప్లస్‌ ఏసీ బస్సుకు మంగళవారం సాయంత్రం కొద్దిలో ప్రమాదం తప్పింది. బస్సు వెనుక వైపు నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే నిలిపివేశాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగానే టైరుకు మంటలు అంటుకున్నాయి. దీంతో వెనుక టైరు పూర్తిగా కాలిపోయింది.

ప్రయాణికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతోంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రివేళలో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు