గోవులు... భారతీయుల సంపద

6 Sep, 2015 12:37 IST|Sakshi

తిరుపతి : దేశీయ గోవుల జాతిని పరిరక్షించడానికి కృషితోపాటు గోవుల సంరక్షణ టీటీడీ ధ్యేయమని ఆ సంస్థ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకృష్ణ అష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో టీటీడీ ఛైర్మన్ చదలవాడ, ఈవో సాంబశివరావు గోపూజ చేశారు.

ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ... గోవులు... భారతీయుల సంపదగా అభివర్ణించారు. గోవులకు వ్యాధి నిరోధక ఔషధాలతో ప్రయోగాలు చేయిస్తున్నామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు