నాన్న నిర్ణయిస్తేనే.. పాలేరులో పోటీచేస్తా

20 Apr, 2016 03:42 IST|Sakshi
నాన్న నిర్ణయిస్తేనే.. పాలేరులో పోటీచేస్తా

తుమ్మల తనయుడు యుగంధర్

 కోదాడ అర్బన్: తన తండ్రి నిర్ణయిస్తేనే.. పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తెలిపారు. మంగళవారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుటుం బంలో తన తండ్రి మినహా వేరెవరూ ఇప్పటి వరకు రాజకీయాల్లో లేరన్నారు. 27న జరగనున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తుమ్మల యుగంధర్ తెలిపారు.

మరిన్ని వార్తలు