ఆర్కే బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

14 Oct, 2016 17:37 IST|Sakshi

విశాఖపట్నం: స్నేహితులతో కలిసి బీచ్‌లో స్నానం చేస్తున్న ఇద్దరు బాలురు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కంచెరపాలెం గ్రామానికి చెందిన ఆదిత్య(14), సంతోష్(14)లు స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్‌లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఇది గుర్తించిన స్థానికులు ఓ బాలుడిని కాపాడగా.. ఆదిత్య, సంతోష్ గల్లంతయ్యారు. వారికోసం స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు