ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ఇద్దరి మృతి

9 Nov, 2016 01:57 IST|Sakshi

వరంగల్ రూరల్: ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలం బుధరావుపేట శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు