కర్నూల్ జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి

26 Apr, 2016 16:54 IST|Sakshi

వడదెబ్బ తగిలి ఇద్దరు మృత్యవాత పడిన సంఘటన కర్నూల్ జిల్లాలో మంగళవారం జరిగింది. కోడుమూరు మండలంలోని మూడుమూల గ్రామంలో మహబూబ్ బాష (15) పశువులకు నీళ్లు తాపడానికి వెళ్ళి వడదెబ్బ తగిలి చనిపోయాడు. మరో ఘటనలో గోనెగండ్ల మండలం కురిమాల గ్రామంలో చాకలి వెంకటేశ్వర్లు పొలంలోని వరిగడ్డిని తరలిస్తుండగా వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.

 

మరిన్ని వార్తలు