రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎడ్డిప గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 12 మందికి గాయాలు కాగా వారిని 108 వాహనంలో నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.
రావికమతం మండలం గన్నవారం గ్రామానికి చెందిన యువతికి రోలుగుంట మండలానికి చెందిన యువకుడితో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు వ్యానులో తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.