భూతగాదాలో ఇద్దరికి తీవ్ర గాయాలు

18 Nov, 2015 20:00 IST|Sakshi

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో భూవివాదం నేపథ్యంలో తల్లీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన రంపచోడవరం మండలం దిర్శినపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కోసు లక్ష్మి(48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో లక్ష్మి ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి గత కొంత కాలంగా ఆమెతో భూమికి సంబంధించిన విషయంలో తగాదా పడుతున్నాడు. తాజాగా బుధవారం లక్ష్మి ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఆమె మీద గొడ్డలితో దాడి చేశాడు. ఇది గుర్తించిన ఆమె కొడుకు చన్నాలదొర(25) అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతనిపై కూడా దాడి చేశాడు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు