చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

15 Jan, 2017 16:27 IST|Sakshi

మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతిచెందారు. జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం గ్రామానికి శ్రీవరామ కృష్ణ(5), శ్రీసాయి(3) అనే ఇద్దరు చిన్నారులు ఆదివారం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు మృతితిచెందారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలువుకున్నాయి.

మరిన్ని వార్తలు