విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి

8 Jan, 2016 12:43 IST|Sakshi

విజయవాడ: విద్యుత్ లైన్ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు కార్మకులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన విజయవాడలోని మొగల్‌రాజ్‌పురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసే విద్యుత్ లైన్ కోసం పనులు నిర్వహిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై తంగెళ్లమూడి రామకోటి(40), శ్రీను(42) అనే ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు