లారీని ఢీకొన్న టయోటా: ఇద్దరు మృతి

3 Jul, 2016 10:45 IST|Sakshi

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద ఆదివారం లారీని టయోటా కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు