ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

18 Aug, 2016 09:29 IST|Sakshi

మహబూబ్‌నగర్ : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపల్లిలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

డ్రైవర్తో సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు