బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రామభద్రాపురం ఎస్సీ కాలనీలో కరెంట్ షాక్తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కన్నా బాబూరావు ఇంటి వద్ద శుక్రవారం ఉదయం బోరు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. బోరు వేసేందుకు ఇరానా(35)అనే కార్మిడుకు ఇనుప రాడ్లు తెస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో.. ఇరానాతో పాటు ఆ పక్కనే ఉన్న శంకరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. శంకర్ రావు స్వస్థలం పాలకొండ మండలం కొండాపురం. కుమార్తె ఇంటికి వచ్చిన శంకర్ రావు ఈ ప్రమాదంలో మృతి చెందాడు.