పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బి.చంద్రయ్య, షౌకత్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై పూడూరు నుంచి వికారాబాద్ వెళుతూ ఆగి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.