విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

5 Jun, 2016 11:46 IST|Sakshi

 ఆగిరిపల్లి పంచాయతీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి మాదల గోపాల్ రావు(60), సునీత(25) అనే ఇద్దరు మృతిచెందారు. ఉతికిన బట్టలను ఇనుప వైరుపై ఆరేస్తుండగా కరెంటు షాక్ తగలడంతో సునీత గిజగిజ కొట్టుకుంటుంది. ఇది చూసిన గోపాల్‌రావు ఆమె రక్షించబోయి పట్టుకోబోవడంతో ఆయనకు కూడా షాక్ కొట్టింది.

 

కరెంటు షాక్‌తో ఇద్దరూ ఊగుతుండటంతో గమనించిన స్థానికులు కర్రతో కొట్టారు. అప్పటికే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోపాల్ రావు గొంతులో ప్రాణం ఉందేమోనని ఆశతో ఆయనను విజయవాడకు తరలించారు. కానీ ప్రాణం పోయిందనుకుని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి ఆగిరిపల్లి తీసుకువచ్చారు.

 

మరిన్ని వార్తలు